టీడీపీ నేతలు ఏపీని రావణ కాష్టంలా మారుస్తున్నారని వైసీపీ నేత అంజాద్ భాషా అన్నారు. ప్రశాంతమైన కడప నియోజకవర్గంలో టీడీపీ నాయకులు వైసీపీ నేతలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ఇప్పటి వరకు కడపలో మత విధ్వేషాలు లేవని, కడప టీడీపీ నేతలు రెచ్చగొడుతున్నారని వారి ట్రాప్ లో పడవద్దంటూ వైసీపీ నేతలకు అంజాద్ భాషా విజ్ఞప్తి చేశారు.