అనపర్తి ప్రెస్ క్లబ్ ప్రాంగణంలో ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు మరణం పట్ల పలువురు పాత్రికేయులు, సాహితీవేత్తలు, ప్రముఖులు సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. సందర్భంగా రామోజీరావు చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. చిత్రపటం వద్ద పుష్పాలు వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా రామోజీరావు మృతి పాత్రకేయ రంగానికి తీరనిలోటని పలువురు ప్రముఖులు అన్నారు.