
దేవరపల్లి: తూ. గో జిల్లాలో ఎండ తీవ్రత అధికం
ఉమ్మడి తూ. గో జిల్లాలోని శుక్ర, శనివారం వేడిగాలులు తీవ్రత ఎక్కువ ఉంటుందని వాతవరణ శాఖ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది. జిల్లాలోని చాగల్లు, దేవరపల్లి, పెరవలి, తాళ్లపూడి, నల్లజర్ల, కొవ్వూరు, నిడదవోలు, పెరవలి, ఉండ్రాజవరం మండలాల్లో వేడిగాలుల ప్రభావం ఎక్కువ ఉంటుందని హెచ్చరించింది. ప్రజలు దూర ప్రాంత ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించింది. వైద్యుల సూచనలు తప్పనిసరిగా పాటించాలన్నారు.