ప్రజలు రానున్న ఎన్నికల్లో కూటమిని అధికారంలోకి తీసుకురానున్నారని, అధికారంలోకి వచ్చిన తరువాత అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో చూపిస్తామని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు. మంగళవారం రాజమండ్రిలోని 13వ డివిజన్ అంబేడ్కర్ నగర్లో రాజమండ్రి ఎంపీ కూటమి అభ్యర్థి దగ్గుబాటి పురందీశ్వరి తనయుడు హితేష్ చెంచురామ్తో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. స్థానిక నాయకులు పాల్గొన్నారు.