కడియం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సోమవారం ఎంపీడీవో రాజ్ మనోజ్ మండల స్థాయి పరిపాలన అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాకాలంలో లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురికాకుండా కాలువల్లో, డ్రైనేజీల్లో పూడిక తీయాలని సూచించారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి పెట్టాలన్నారు.