8 వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల
![8 వేల క్యూసెక్కుల సాగునీరు విడుదల](https://media.getlokalapp.com/cache/c3/f3/c3f3f716c1dd686b55f1aa49c17702d2.webp)
రాజమండ్రి రూరల్ మండలంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి సోమవారం 8 వేల క్యూసెక్కుల సాగునీటిని విడుదల చేశామని జలవనరులశాఖ అధికారులు తెలిపారు. వాటిలో తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టాలకు 2500, 1500, 4000 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం కాటన్ బ్యారేజీ వద్ద 10. 05 అడుగుల నీటిమట్టం కొనసాగుతున్నట్లు వివరించారు.