అనపర్తి అసెంబ్లీ సీటు టిడిపికి కేటాయించి రామకృష్ణారెడ్డిని అభ్యర్థిగా ప్రకటించాలని కోరుతూ కుతుకులూరు గ్రామానికి చెందిన ఓ కార్యకర్త శనివారం గౌరీపట్నం కొండపైకి మోకాళ్లపై ఎక్కారు. అనపర్తి సీటు ముందు టిడిపికి ప్రకటించి, కూటమిలో బిజెపి చేరాక బిజెపి అభ్యర్థిని ప్రకటించారు. దీంతో రామకృష్ణారెడ్డి కే సీటు కేటాయించాలని కోరుతూ గౌరీపట్నం కొండ మోకాళ్ళపై ఎక్కి మొక్కుకున్నారు.