సంక్షేమ పాలన అందిస్తున్న వైసీపీని మరోసారి గెలిపించాలని ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి సతీమణి ఆదిలక్ష్మి కోరారు. పెదపూడి మండలం పైన గ్రామంలో శనివారం జరిగిన వైసిపి ఇంటింటి ప్రచార కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్తూ వైసిపి ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలను వివరిస్తూ వచ్చే ఎన్నికల్లో ఓటు వేసి గెలిపించాలని కోరారు.