ధాన్యం బకాయిలను వెంటనే చెల్లించాలి

83చూసినవారు
ప్రభుత్వ నిబంధనలతో ధాన్యం విక్రయాలకు ఆపసోపాలు పడిన రైతులకు ఇప్పుడు బిల్లులు అందకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలంలో రైతులు శనివారం ఆందోళన వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలు ద్వారా ఏప్రిల్ మొదటి వారం నుంచే అధికారులు ధాన్యం కొనుగోలు ప్రారంభించి కొన్ని వేల మెట్రిక్ టన్నులు సేకరించారు. దీనికి సంబంధించి రైతులకు బిల్లులు చెల్లించాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్