ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ఏ రాజకీయ పార్టీల నాయకులు కూడా నగదు, మద్యం పంపిణీ చేయకుండా అడ్డుకోవాలని తూ. గో జిల్లా ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు జిల్లా కలెక్టర్ మాధవి లత సూచించారు. సోమవారం రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆమె ఎన్ఫోర్స్మెంట్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో ముమ్మరంగా వాహన తనిఖీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.