లోతట్టు ప్రాంతాలలో పర్యటించిన బీజేపీ కో కన్వీనర్ ఏసు

79చూసినవారు
గత మూడు రోజులగా కురుస్తున్న వర్షాల కారణంగా రాజమండ్రి రూరల్ మండలం వెంకటనగరం పంచాయతీలోని అగ్రహారం గ్రామ లోతట్టు ప్రాంతం నీట మునిగింది. విషయం తెలుసుకున్న రూరల్ బీజేపీ కో కన్వీనర్ యానాపు ఏసు, పంచాయతీ సెక్రెటరీ రాణి, స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరిశీలించారు. మోటార్ల సహాయంతో నీటిని తోడేందుకు ఏర్పాటు చేశారు. ఈ సమస్య పరిష్కారానికి డ్రైనేజీలు నిర్మించాలని సంబంధిత అధికారులను వారు కోరారు.

సంబంధిత పోస్ట్