కొంతమూరులో స్వచ్ఛభారత్ కార్యక్రమం

74చూసినవారు
రాజమండ్రి రూరల్ మండలం కొంతమూరు గ్రామంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురువారం నిర్వహించారు. గ్రామ టీడీపీ అధ్యక్షులు దండమూడి ప్రసాద్ ఆధ్వర్యంలో చెంచు కాలనీ తదితర ప్రాంతాలలో జరిగిన ఈ కార్యక్రమంలో పరిసరాలను పరిశుభ్రం చేశారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ కార్యక్రమంలో మండల టీడీపీ అధ్యక్షుడు మత్స్యేటి ప్రసాద్, పిన్నమరెడ్డి ఈశ్వరుడు పంచాయతీ కార్యదర్శి ఎం. విజయ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్