స్వల్పంగా పెరిగిన గోదావరి నీటిమట్టం

71చూసినవారు
సీతానగరం మండలంలోని గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో నీటిమట్టం స్వల్పంగా పెరిగినట్లు ఇరిగేషన్ అధికారులు శుక్రవారం తెలిపారు. రెండు రోజులుగా తుఫాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తోడు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న నీటి ప్రవాహంతో నీటిమట్టం పెరిగిందని తెలిపారు. వర్షాలు కురవడం వల్ల గోదావరి నది ఒడ్డు ప్రాంతాలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎవరు స్నానాలకు నదిలోకి దిగకూడదని అధికారులు హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్