May 09, 2024, 11:05 IST/నాగర్ కర్నూల్
నాగర్ కర్నూల్
సమస్యలపై గళం వినిపిస్తా... ఎంపీగా ఆశీర్వదించండి: బర్రెలక్క
May 09, 2024, 11:05 IST
నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తనకు ఓటు వేసి ఆశీర్వదించాలని గురువారం స్వతంత్ర అభ్యర్థి కర్నే శిరీష (బర్రెలక్క) విజ్ఞప్తి చేశారు. సమయం తక్కువగా ఉన్నందున అన్ని గ్రామాలు పర్యటించలేకపోయానని చెప్పారు. ప్రజా సమస్యలు, నిరుద్యోగ సమస్యలపై గళం వినిపించడానికి విజిల్ గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి, తనను పార్లమెంట్ కు పంపించాలని ఓటర్లను కోరారు.