May 20, 2024, 17:05 IST/వనపర్తి
వనపర్తి
26 గ్రామాలకు నిలిచిన భగీరథ నీరు
May 20, 2024, 17:05 IST
రెండు రోజుల నుండి గోపాల్ పేట, రేవల్లి, వనపర్తి జిల్లా & మండలం పరిధిలోని 26 గ్రామాలకు మిషన్ భగీరథ పథకం ద్వారా మంచినీటి సరఫరా నిలిచిపోయింది. గోపాలపేటలోని పంప్ హౌస్లోని మూడు మోటర్లలో రెండు మోటార్లకు చెందిన పంపులు చెడిపోయాయి. మరో మోటార్ ద్వారా 8 గ్రామాలకు నీటి సరఫరా కొనసాగిస్తున్నారు. చెడిపోయిన పంపులను మరమ్మతులు నిమిత్తం జడ్చర్లకు తీసుకెళ్లారు. మోటార్ల బాగు చేసి నీటిని సరఫరాను కొనసాగిస్తామన్నారు.