దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ త్వరలో తల్లిదండ్రులు కాబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దీపిక తొలిసారి బేబీ బంప్తో కనిపించారు. లోక్సభ ఎన్నికల ఐదో విడత పోలింగ్ సందర్భంగా భర్తతో కలిసి ముంబైలోని పోలింగ్ స్టేషన్ వద్ద దర్శనమిచ్చారు. రణ్వీర్, దీపిక ఇద్దరూ వైట్ డ్రెస్సుల్లో పోలింగ్ కేంద్రం వద్ద మెరిశారు. రణ్వీర్ దీపిక చేయి పట్టుకుని పోలింగ్ బూత్లోకి తీసుకెళ్లి ఓటు వేయించారు.