టీడీపీ నేతలు అచ్చెన్నాయడు, అయ్యన్నపాత్రుడికి ఏపీ ఎన్నికల కమిషన్ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరు నేతలు ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఈసీకి వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ఫిర్యాదు చేశారు. ట్విట్టర్, ఫేస్ బుక్ ద్వారా సీఎం జగన్పై తప్పుడు ఆరోపణలు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై వివరణ కోరుతూ అయ్యన్న, అచ్చెన్నకు సీఈఓ ముఖేష్కుమార్ మీనా నోటీసులు ఇచ్చారు.