వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి కీలక నిర్ణయం?

83చూసినవారు
వాలంటీర్ల కొనసాగింపుపై ఎల్లుండి కీలక నిర్ణయం?
AP: వాలంటీర్ల కొనసాగింపుపై గురువారం కేబినెట్ భేటీలో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు వాలంటీర్లకు రూ.10 వేల జీతం పెంచి విద్యార్హతల ఆధారంగా వివిధ శాఖల్లో సర్దుబాటు చేయనున్నట్లు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా 2.65 లక్షల మంది వాలంటీర్లు ఉండగా.. ఎన్నికల సమయంలో 1.09 లక్షల మంది రాజీనామా చేశారు. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవచ్చట. దీనిపై త్వరలోనే స్పష్టత రానున్నట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్