చిత్రకళలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన అడివి బాపిరాజు

61చూసినవారు
చిత్రకళలో ఆకాశమంత ఎత్తు ఎదిగిన అడివి బాపిరాజు
చిత్రకళ అంటే అడివి బాపిరాజుకు ప్రాణం. చిన్నతనం నుండి చిత్రకళ మీద ఉన్న మక్కువతో బందరు జాతీయ కళాశాలలోని ప్రమోద్ కుమార్ చటోపాధ్యాయ దగ్గర శిష్యునిగా చేరి భారతీయ చిత్రకళలో నైపుణ్యం సాధించారు. ఆ నైపుణ్యంతో చిత్రకళలో ఆకాశమంత ఎత్తు ఎదిగారు. కిన్నెరసాని ఎలా ఉండాలి, నాయుడు బావ ఎలా ఉండాలి అని ఊహించి నండూరి వారి కవితలకి చక్కని చిత్రాలను గీసారు బాపిరాజు. వీరు గీసిన “శబ్దబ్రహ్మ” చిత్రం నేటికీ డెన్మార్క్ ప్రదర్శనశాలలో ఉంది.

సంబంధిత పోస్ట్