చింతలపూడి నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యేగా గెలుపొందిన సొంగ రోషన్ కుమార్ ను ఏలూరులోని వారి స్వగృహం నందు మాజీ కన్వీనర్ జగ్గారపు ముత్తారెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యేగా గెలిచినందుకు శుభాకాంక్షలు తెలియజేశారు. నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.