లింగపాలెం మండలం ముడిచెర్ల, వేములపల్లి, పోలాసిగూడెం గ్రామాలలో ఆదివారం కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి రోషన్ కుమార్ ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో నాయకులతో కలిసి ఆయన పర్యటించి ప్రజలతో మమేకమై వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రానున్న ఎన్నికల్లో తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు.