కలిదిండి: కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే

80చూసినవారు
కలిదిండి: కనకదుర్గమ్మను దర్శించుకున్న ఎమ్మెల్యే
కలిదిండి గ్రామంలోని కనకదుర్గమ్మను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గురువారం దర్శించుకున్నారు. ఆయనకు వేద పండితులు స్వాగతం పలికారు. దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. టీడీపీ మండల అధ్యక్షులు పోకల జోగిరాజు, ఏఎంసీ మాజీ చైర్మన్ వి.శ్రీనివాస్ చౌదరి, డీసీ మాజీ చైర్మన్లు ఎం. భోగేశ్వరరావు, పి.సత్యనారాయణ, ఎన్డీఏ నాయకులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.