పెద్దింట్లమ్మ ఆలయానికి భక్తుల తాకిడి
కొల్లేటికోటలోని పెద్దింట్లమ్మ దేవస్థానం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారంతో పాటు వేసవి సెలవులు కావడంతో ఏలూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన పలవురు భక్తులు, విద్యార్థులు వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. దేవస్థాన ప్రధాన అర్చకుడు పరమే శ్వరశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి వేకువజాము నుంచే పలు అభిషేకాలు, విశేష పూజలు, పంచామృ తాభిషేకం, ధూపసేవ వంటి ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.