నరసాపురం: రైతులు తీసుకున్న పంట రుణాలకు మరో రెండేళ్లకు రీషెడ్యూల్

52చూసినవారు
నరసాపురం: రైతులు తీసుకున్న పంట రుణాలకు మరో రెండేళ్లకు రీషెడ్యూల్
పశ్చిమ గోదావరి జిల్లాలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, సంభవించిన వరదలకు పంటలు దెబ్బతిన్న రైతులు వారు తీసుకున్న పంట రుణాలు రెండేళ్ల వరకు రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. గురువారం భీమవరం కలెక్టర్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. రైతులు తీసుకున్న పంట రుణాలు తిరిగి చెల్లింపు మారిటోరియంతో కలిపి రెండేళ్ల వరకు పొడిగింపు చేసుకునే అవకాశం ఉందని వివరించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్