విసన్నపేటలో పందులు పట్టివేత

77చూసినవారు
విసన్నపేటలో పందులు పట్టివేత
విస్సన్నపేట పట్టణంలోని గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ కాలనీ, బీసీ కాలనీ, ఎస్సీ కాలనీ అదేవిధంగా తదితర ప్రాంతాలలో గుంపులు గుంపులుగా తిరుగుతున్న పందుల వలన అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున స్థానిక ప్రజల ఫిర్యాదు మేరకు సర్పంచి నాగమల్లేశ్వరి ఆధ్వర్యంలో. మంగళవారం పందులు పట్టివేత కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 150 పందుల వరకు పట్టి సుదూర ప్రాంతాల్లో వదిలినట్లు సర్పంచ్ నాగమల్లేశ్వరి తెలిపారు.