నూజివీడు: ప్రయాణికుల భద్రతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత
ప్రయాణీకుల భద్రత, సుఖ ప్రయాణానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. నూజివీడు నుండి హైదరాబాద్ సూపర్ లగ్జరీ బస్సు సర్వీస్ ను ఆదివారం ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ తో కలిసి స్థానిక ఆర్టీసీ బస్సు స్టాండ్ లో సూపర్ లగ్జరీ బస్సును మంత్రి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తామన్నారు.