సీపీఎం బలోపేతానికి ఆర్ఎస్ చేసిన సేవలు మరువలేనివి

83చూసినవారు
సీపీఎం బలోపేతానికి ఆర్ఎస్ చేసిన సేవలు మరువలేనివి
సీపీఎం బలోపేతానికి రుద్రరాజు సత్యనారాయణ రాజు (ఆర్ఎస్) చేసిన సేవలు మరువలేనివని సీపీఎం మండల నాయకుడు కండెల్లి సోమరాజు అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం మండలం ఇటుకలగుంట గ్రామంలో ఆర్ఎస్ సంతాప సభ నిర్వహించారు. రైతాంగ, యువజన, మహిళ, దళితుల సమస్యలపై ఆర్ఎస్ అలుపెరుగని పోరాటం చేశారన్నారు. పి సత్యనారాయణ, సత్యవతి, ఎం సీతామహాలక్ష్మి, ఎం వెంకటరమణ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్