తణుకు: ప్రజాసమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే

60చూసినవారు
తణుకు: ప్రజాసమస్యలకు పరిష్కారం: ఎమ్మెల్యే
ప్రజా సమస్యలు తెలుసుకుని వాటికి పరిష్కారం చూపించే దిశగా గ్రామదర్శిని కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ అన్నారు. సోమవారం అత్తిలి మండలం కే. సముద్రపు గట్టు గ్రామంలో పర్యటించిన ఆయన ప్రతి ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్