దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి

62చూసినవారు
దోమలు పెరగకుండా చర్యలు తీసుకోవాలి
వర్షాకాలం దృష్ట్యా దోమలు పెరగకుండా చర్యలుతీసుకోవాలని పెదనిండ్రకొలను పీహెచ్సీ వైద్యాధికారి భాగ్యశ్రీ అన్నారు. మంగళవారం నిడమర్రు మండలం
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఆశా డే సమావేశం నిర్వహించారు. గర్భిణులను గుర్తించి వారి ఆరోగ్య రక్షణకు పోషకాహారం అందించాలన్నారు. అనంతరం సాంఘిక సంక్షేమ హాస్టల్లో దోమల నివారణ మందు పిచికారీ చేశారు. సబ్ యూనిట్ అధికారి లక్ష్మణరావు, సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్