‘ప్రజాగళం’ సభకు సర్వం సిద్ధం

3958చూసినవారు
‘ప్రజాగళం’ సభకు సర్వం సిద్ధం
పల్నాడు జిల్లాలోని చిలకలూరి పేటలో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తొలి ఉమ్మడి సభ ‘ప్రజాగళం’ను ఆదివారం నిర్వహించనున్నారు. ఈ సభలో ప్రధాని మోడీ, టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. బోపూడిలో జరిగే ఈ సభకు భారీ ఏర్పాట్లు చేశారు. కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సభా ప్రాంగణం టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలు, ఫ్లెక్సీలతో నిండిపోయింది.