ఏపీలో హింసపై రేపు ఎగ్జిబిషన్: వైసీపీ

62చూసినవారు
ఏపీలో హింసపై రేపు ఎగ్జిబిషన్: వైసీపీ
ఢిల్లీలోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్ వద్ద బుధవారం ఫోటో, వీడియో ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు మంగళవారం వైసీపీ ఒక ప్రకటనలో తెలిపింది. దీనిని కవర్ చేయడానికి మీడియాను ఆహ్వానించింది. ఏపీలో వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, హత్యలను హైలెట్ చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే మాజీ సీఎం జగన్, వైసీపీ నేతలు ఢిల్లీకి వెళ్లిన సంగతి తెలిసిందే.

సంబంధిత పోస్ట్