రిమ్స్ ఆస్పత్రికి మాజీ సీఎం జగన్

76చూసినవారు
రిమ్స్ ఆస్పత్రికి మాజీ సీఎం జగన్
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ రిమ్స్ ఆస్పత్రికి చేరుకున్నారు. శనివారం కడప ఎయిర్‌పోర్టు నుంచి జగన్ రిమ్స్ ఆస్పత్రికి వచ్చారు. నిన్న వైసీపీ నేత, మాజీ శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి, అనుచరుడు వేంపల్లి అజయ్ కుమార్ రెడ్డిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన విషయం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన అతను ప్రస్తుతం రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. విషయం తెలుసుకున్న జగన్ అతడిని పరామర్శించేందుకు రిమ్స్‌కు వెళ్లారు.

సంబంధిత పోస్ట్