గుంటూరులోని హాస్పిటల్ వద్ద రోగి బంధువులు ఆందోళన

76చూసినవారు
గుంటూరు నగరంలోని ఓ ఆసుపత్రి వద్ద రోగి బంధువులు, ఎమ్మార్పీఎస్ నాయకులు అర్థరాత్రి ఆందోళనకు దిగారు. తాడేపల్లి మండలం గుండిమెడ గ్రామానికి చెందిన శ్రీనివాసరావు (50) కాళ్ల నొప్పులతో ఆసుపత్రిలో చేరారు. చికిత్స అందిస్తూనే ఉన్నట్టుండి శ్రీనివాసరావు చనిపోయాడని వారి బంధువులకు వైద్యులు తెలిపారు. దీంతో బాధితులు ఎమ్మార్పీఎస్ తో కలిసి ఆందోళనకు దిగారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ఇలా జరిగిందని మండిపడ్డారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్