కూచిపూడిలో 23 మంది వాలంటీర్లు రాజీనామా
అమృతలూరు మండల పరిధిలోని కూచిపూడి గ్రామంలో 26 మంది వాలంటీర్లకు గాను, 23 మంది వాలంటీర్లు శనివారం రాజీనామా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి భోగాది తిరుమలరావు తెలిపారు. వారి వ్యక్తిగత కారణాలవల్ల వాలంటీర్ గా రాజీనామా చేస్తున్నట్లు లిఖితపూర్వకంగా అందజేశారు. గతంలో ఇరువురు వాలంటీర్లు రాజీనామా చేశారని, వాలంటీర్లు రాజీనామా చేసిన విషయం ఎంపీడీవో, కే. స్వరూపరాణి కి సమాచారం అందజేసినట్లు కార్యదర్శి తెలిపారు.