సన్రైజర్స్ హైదరాబాద్తో జరుగుతున్న మ్యాచ్లో లక్నో సూపర్ జెయింట్స్ స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్ కేవలం 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ సాధించారు. హాఫ్ సెంచరీతో పూరన్ ఐపీఎల్ 2025లో మరో రికార్డు క్రియేట్ చేశారు. ఐపీఎల్ 18వ సీజన్లో ఇప్పటి వరకు ఇదే వేగవంతమైన అర్ధశతకం. ఐపీఎల్లో పూరన్కు ఇది 11వ హాఫ్ సెంచరీ. దీంతో 7 ఓవర్లకు LSG స్కోర్ 96/1గా ఉంది. క్రీజులో నికోలస్ పూరన్ (61), మిచెల్ మార్ష్ (26) ఉన్నారు.