ద్విచక్ర వాహనం చోరీ

60చూసినవారు
ద్విచక్ర వాహనం చోరీ
ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాన్ని గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారు. ఈ సంఘటన మాచర్ల పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ముళ్ళ ఆసుపత్రి వద్ద చోటుచేసుకుంది. పట్టణానికి చెందిన మున్సిపల్ ఉద్యోగి భైరు రామారావు తన ద్విచక్ర వాహనాన్ని ఇంటి ముందు పార్కు చేశారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు వాహనాన్ని దొంగిలించినట్లు ఆయన చెప్పారు. పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్