నరసరావుపేటలో భారీ అగ్ని ప్రమాదం

10154చూసినవారు
పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణంలోని షాలిమ్ నగర్ లో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ ట్రాన్స్ఫారంలో అధికంగా మంటలు చెలరేగడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనలకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. ఈ ప్రమాదంలో ఎటువంటి ఆస్తి, ప్రాణ నష్టం లేదని స్థానికులు పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్