ఎస్ టియుపి జిల్లా అదనపు కార్యదర్శి గా తోటకూర వీరాంజనేయులు

66చూసినవారు
ఎస్ టియుపి జిల్లా అదనపు కార్యదర్శి గా తోటకూర వీరాంజనేయులు
నరసరావుపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఎస్ టియుపి ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా 77వ వార్షిక కౌన్సిల్ మరియు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగినది. ఈ ఎన్నికలలో ఎంపిపిఎస్ వీరమ్మ కాలనీ లో సెకండరీ గ్రేడ్ టీచరుగా విధులు నిర్వహిస్తున్న తోటకూర వీరాంజనేయులు జిల్లా అదనపు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అతనితో పాటుగా షేక్ నూహానుల్లా జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్