నరసరావుపేట మున్సిపల్ బాలుర ఉన్నత పాఠశాల నందు ఎస్ టియుపి ఆంధ్ర ప్రదేశ్ పల్నాడు జిల్లా 77వ వార్షిక కౌన్సిల్ మరియు జిల్లా నూతన కార్యవర్గ ఎన్నిక మంగళవారం జరిగినది. ఈ ఎన్నికలలో ఎంపిపిఎస్ వీరమ్మ కాలనీ లో సెకండరీ గ్రేడ్ టీచరుగా విధులు నిర్వహిస్తున్న తోటకూర వీరాంజనేయులు జిల్లా అదనపు కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారు. అతనితో పాటుగా షేక్ నూహానుల్లా జిల్లా ఆర్థిక కమిటీ సభ్యులు గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.