నరసరావుపేట: పొలాల్లోకి దూసుకెళ్లిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు
పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం పెట్లూరివారిపాలెం గ్రామం వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మంగళవారం పొలాల్లోకి దూసుకెళ్లింది. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు మధ్యప్రదేశ్ నుండి విజయవాడ వెళ్లి శ్రీశైలం వెళ్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న వారికి ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు.