
నరసరావుపేట: అనధికార బెల్ట్ షాపులపై చర్యలు తీసుకోవాలి: పీడీఎం ధర్నా
మద్యం బెల్టు షాపులను తొలగించి నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలని పీడీఎం నాయకులు సోమవారం పల్నాడు కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న మద్యం షాపుల ద్వారా మారుమూల తండాలకు సైతం అనధికార బెల్ట్ షాపులు నిర్వహిస్తున్నారన్నారు. తద్వారా పేద ప్రజలు తమ కష్టార్జితం అంత మద్యానికి ఖర్చు పెడుతూ పూట గడవక కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.