చోరీ కేసులో అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ 24కిలోల వెండి స్వాధీనం

51చూసినవారు
పొన్నూరు పట్టణంలో ఈనెల 4న నగల షాపులో చోరీ కేసులో ముద్దాయిలను పొన్నూరు పోలీసు శనివారం అరెస్టు చేశారు. పొన్నూరు స్టేషన్లో డిఎస్పి జనార్దన్ రావు, సీఐ రవికిరణ్ తో కలిసి మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఏడుగురు ముద్దాయిలు ముఠాగా ఏర్పడి చోరీ చేసినట్లు డి. ఎస్. పి తెలిపారు. నిందితుల కారు, రూ. 21 లక్షల విలువ గల 24 కిలోల వెండి వస్తువులను స్వాధీన చేసుకొని రిమాండ్ కు పంపుతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్