సత్తెనపల్లి తారకరామ సాగర్ చెరువులో బాలుని మృతదేహం

1896చూసినవారు
సత్తెనపల్లి తారకరామ సాగర్ చెరువులో బాలుని మృతదేహం
సత్తెనపల్లి తారక రామ్ సాగర్లో ఈతకు వెళ్లి దుర్గా ప్రవీణ్(10) మృతి చెందాడు. నిన్న ఆదివారం కావడంతో స్నేహితులతో కలిసి చెరువులో ప్రవీణ్ ఈతకు వెళ్లాడు. సాయంత్రం నుంచి బాలుడు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం తారకరామ సాగర్ చెరువులో చిన్నారి మృతదేహం కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అనంతరం మృతదేహాన్ని బయటకు తీశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్