రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు

76చూసినవారు
రేషన్ పంపిణీలో అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు
సత్తెనపల్లి పట్టణంలో పల్నాడు జిల్లా జాయింట్ కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ మంగళవారం రేషన్ పంపిణీ వాహనాన్ని తనిఖీ చేశారు. రేషన్ కార్డుదారులకు నిత్యావసర సరుకులు సక్రమంగా పంపిణీ చేయాలని ఆదేశించారు. అక్రమాలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ తో పాటు ఆర్డీవో మురళీ కృష్ణ, తహసీల్దార్ ఉష, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్