సత్తెనపల్లిలో సామూహిక బక్రీద్ ప్రార్ధనలు

71చూసినవారు
సత్తెనపల్లి పట్టణంలోని ముస్లిం మైనారిటీలు ఈద్గాల వద్ద సోమవారం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని అన్ని మసీదులకు చెందిన ముస్లిం మైనార్టీలు ఈద్గా వద్దకు చేరుకుని ప్రత్యేక దువా చదివారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, రైతులు సుఖ సంతోషాలతో ఆనందంగా ఉండాలని ప్రత్యేక ప్రార్థన చేశారు. ఇమామ్ మౌజోనులు బక్రీదు పండుగ ప్రత్యేకతను, ప్రార్థనకు విచ్చేసిన ముస్లిం సోదరులకు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్