మార్చి నాటికి దేశవ్యాప్తంగా బి ఎస్ ఎన్ ఎల్ 4జి సేవలు

79చూసినవారు
దేశవ్యాప్తంగా వీలైనంత వేగంగా బి ఎస్ ఎన్ ఎల్ 4జి సేవలు విస్తరించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. ఆదివారం తాడికొండలో 4జి టవర్ ను ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ తో కలిసి పరిశీలించారు. అనంతరం బేస్ బ్యాండ్ యూనిట్ ను ఆయన ప్రారంభించారు. పెమ్మసాని మాట్లాడుతూ. సెప్టెంబర్ కల్లా 70%, మార్చి లోపు 100% 4జి సేవలను దేశవ్యాప్తంగా అమలు చేయబోతున్నామన్నారు.

సంబంధిత పోస్ట్