

తాడికొండ: భూ సమస్యను పరిష్కరించాలంటూ.. ఎమ్మెల్యేకు ఫిర్యాదు
సీఆర్డీఏ కార్యాలయంలో భూ సమస్యల పరిష్కారం కావడం లేదని, నెలలు తరబడి తిరిగినా తమకు న్యాయం జరగడం లేదని బాధితులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ కు శుక్రవారం ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే స్థానిక అధికారులతో ఫోన్లో మాట్లాడి వెంటనే సమస్యలను పరిష్కరించి బాధితులకు న్యాయం జరిగేలా చేయాలని కోరారు. అనంతరం బాధితులను టీడీపీ గ్రామ పార్టీ అధ్యక్షున్ని సీఆర్డిఏ కార్యాలయానికి పంపారు.