అక్రమాస్తుల కేసులోని ఎఫ్ఐఆర్లో వైఎస్ఆర్ పేరును సీబీఐ చేర్చలేదని షర్మిల అన్నారు. విశాఖలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. "జగన్ ఆదేశాల మేరకే ఛార్జిషీట్లో వైఎస్ఆర్ పేరును పొన్నవోలు సుధాకర్రెడ్డి చేర్చే ప్రయత్నం చేశారు. జగన్ బయటపడాలంటే వైఎస్ఆర్ పేరును చేర్చాలనేది వారి ఉద్దేశం. సీఏం పదవి చేపట్టిన 6 రోజుల్లోనే పొన్నవోలుకు ఏఏజీ పదవి కట్టబెట్టారు. హడావుడిగా ఏఏజీ పదవిని ఎందుకు ఇచ్చారు?" అని ప్రశ్నించారు.