ఆయుర్వేద ఔషధ తయారీదారులకు హెచ్చరిక

56చూసినవారు
ఆయుర్వేద ఔషధ తయారీదారులకు హెచ్చరిక
తప్పుదోవ పట్టించే ప్రకటనలకు సంబంధించి పతంజలిపై సుప్రీంకోర్టు సీరియస్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయుష్ మంత్రిత్వ శాఖ దేశంలోని ఆయుర్వేద ఔషధ తయారీదారులకు కీలక హెచ్చరికలు జారీ చేసింది. ఆయుర్వేద, సిద్ధ, యునాని, హోమియోపతి మందుల తయారీదారులందరూ తమ ఉత్పత్తులకు సంబంధించిన లేబులింగ్, ప్రకటనల్లో ప్రభుత్వ నిబంధనలు కచ్చితంగా పాటించాలని కోరింది. నిబంధనలు పాటించడంలో విఫలమైతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

సంబంధిత పోస్ట్