ప్రధాని మోదీ గుండెల్లో నేనున్నా: పవన్‌

75చూసినవారు
ప్రధాని మోదీ గుండెల్లో నేనున్నా: పవన్‌
AP: వైసీపీ ప్రభుత్వ హయాంలో రోడ్డుపైకి రావాలంటే భయమేసే పరిస్థితి ఉండేదని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. "గతంలో సామాజిక మాధ్యమంలో పోస్టు పెట్టాలంటే భయం. ఇంట్లో వాళ్లపై కూడా దుర్భాషలాడిన పరిస్థితిని చూశాం. ఐదు కోట్ల మంది ఒక్కటై అరాచక ప్రభుత్వానికి బుద్ధి చెప్పారు. ప్రధాని మోదీ గుండెల్లో నేనున్నా.. ఆయన పక్కన నిల్చొని ఫొటో దిగాల్సిన అవసరం లేదు" అని పార్టీ ప్రతినిధుల భేటీలో ఆయన వ్యాఖ్యానించారు.

సంబంధిత పోస్ట్