AP: ఎన్నికల్లో 100% స్ట్రైక్ రేట్తో విజయం సాధించిన జనసేన పార్టీ వినూత్న నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఆ పార్టీ మంత్రులకు కేటాయించిన శాఖలపై ప్రజల నుంచి సలహాలు స్వీకరించాలని నిర్ణయించింది. "మీలో ఎవరైనా ఈ క్రింది శాఖలకు సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలంటే forms.gle/8Y3rRtY1dewPQAyH7 లింక్ ద్వారా ఈ గూగుల్ ఫామ్ ఫిల్ చేయగలరు. ధన్యవాదాలు!" అని పేర్కొంటూ జనసేన ట్వీట్ చేసింది.