ఏపీలో ఈ నెల 6వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ

2290చూసినవారు
ఏపీలో ఈ నెల 6వ తేదీన ఇన్ పుట్ సబ్సిడీ
మిచాంగ్ తుఫాన్ కారణంగా ఏపీలో రైతులు తీవ్రంగా నష్టపోయారు. దీంతో ఇన్ పుట్ సబ్సిడీ కోసం ఎదురుచూస్తున్న రైతులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది. ఈ నెల 6న సీఎం జగన్ బటన్ నొక్కి నష్టపోయిన రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. 2023 ఖరీఫ్ ఏర్పడిన కరువుతో పాటు తుఫాన్ తో నష్టపోయిన 11.59 లక్షల మంది రైతులకు రూ.1294.58 కోట్లు సహాయం ఏపీ ప్రభుత్వం చేయనుంది.

సంబంధిత పోస్ట్